Tuesday, December 2, 2008

మన పూర్వీకులు, మన చరిత్ర

బలి చక్రవర్తి:

ప్రహ్లాదుని మనవడు, వీరోచన - దేవంబ ల సుపుత్రుడు, రాక్షసులకు రాజు, ఇంద్రసేన నామధేయుడు, ప్రపంచానికి మహాబలి గా బలి చక్రవర్తి గా సుపరిచితుడు. ఇతని వంశానికి చెందిన వారిని బలి జన్మస్థులు గా గుర్తించారు. వారినే బలిజులు గా బలిజ వారు గా పిలిచారు.

తాత ప్రహ్లాదుని భక్తి మార్గముననుసరించి అసుర పాలకుడు అయ్యాడు. తన రాజ్యం లో శాంతి - సౌభాగ్యాలు విలసిల్లేవి. సామ్రాజ్య విస్తరణ లో భాగం గా స్వర్గాన్ని జయించాడు. దేవతలని పాలించే ప్రభువు ఒక రాక్షసుడు అనే సత్యం మింగుడుపడని సురులు విష్ణు దేవుని శరణు జొచ్చారు. మహావిష్ణువు వారికి అభయమిచ్చి తానే దైవాధికారాన్ని పునఃప్రతిశ్తిస్తానని మాటిచ్చాడు. గురువు శుక్రాచార్యుని ప్రోద్బలం తో అశ్వమేధ యాగాన్ని చేస్తున్న బలి ని విష్ణువు వామనావతారములో మూడు అడుగుల భూభాగాన్ని దానం అడిగాడు. దానగున సంపన్నుడైన బలి గురువు మాటలను సైతం లెక్క చేయక వామనునికి దానం ఇచ్చాడు. వామనుడు ఒక పాదాన్ని భూమి పై మరొక పాదాన్ని ఆకాశం పై మోపి మూడవ పాదాన్ని ఎక్కడ మోపాలి అని బలిని అడిగాడు. బలి తన శిరసు పై మోపమని తలను వంచాడు. తన తల పై పాదం మోపి వామనుడు బలిని అధఃపాతాళానికి త్రొక్కి వేసాడు. బలి ధర్మాన్ని మెచ్చిన విష్ణువు తనకి స్వర్గం లో స్తానాన్నిచ్చాడు.

శ్రీ కృష్ణ దేవరాయలు (1509 - 1529):
విజయనగర సామ్రాజ్యాధిపతులలో అత్యంత ఖ్యాతి గడించినవాడు, తన అత్యద్భుత పరిపాలన తో ఇటు ఆంధ్రులకు, అటు కన్నడిగులకు అత్యంత ప్రీతిపాత్రుడు, భారత దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో తన పుటను లిఖించటానికి సర్వవిధాల అర్హుడు.
బిరుదులు: కన్నడ రాజ్య రమా రమణ, మూరు రాయర గండ (ముగ్గురు రాజులకు రాజు), ఆంధ్ర భోజ, కర్ణాటకాంధ్ర సమన్వయకర్త మరియు సాహితీ సమరాంగణ చక్రవర్తి
తల్లిదండ్రులు: నాగల దేవి, తుళువ నరస నాయకుడు
సాలువ నరసింహ దేవరాయుని సేనాధిపతి అయిన తుళువ రాజ్యాన్ని కాపాడేందుకు సింహాసనమును అధిశ్తించినాడు. జూలై 26, 1509 న శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన కృష్ణదేవరాయలు పట్టాభిషిక్తుడయ్యాడు. తల్లి స్మృత్యర్థం విజయనగర పొలిమేరల్లో నాగలాపురమును నిర్మించాడు.

రాయల ఆస్థానానికి ముఖ్యుడు మహామంత్రి తిమ్మరుసు. రాయలు అతనిని ప్రేమ తో అప్పా అని సంబోధించే వాడు. కన్నడ లో (తమిళం లో కూడా) అప్పా అంటే అయ్యా అని అర్థం. కర్నూలు, అనంతపురము జిల్లాల్లో (కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో) ఈ సంబోధన ఇప్పటికీ వాడుక లో ఉంది.

విజయనగర సామ్రాజ్యము:

ఇప్పటి ఉత్తర కర్ణాటకలో ని బళ్ళారి జిల్లా లో విజయనగర సామ్రాజ్యము ఏర్పడినది. భౌగోళికంగా ఇది 15°19′N 76°28′ నందు కలదు.
సామ్రాజ్యము లో ని అత్యధిక భాగము తుంగభద్రా నది కి దక్షిణ ఒడ్డున కలదు. హంపి లో ని అతి పవిత్ర ప్రదేశమయిన విరూపాక్ష దేవాలయం చుట్టుప్రక్కల నిర్మించబడ్డది. పండిట్ నెహ్రూ రచించిన 'ది డిస్కవరీ అఫ్ ఇండియా' లో విజయనగరమును దాని యొక్క ప్రాశస్త్యాన్ని ప్రస్తావించాడు. 15వ శతాబ్దానికి విజయనగరము 5,00,000 పౌరులతో భారత దేశం లో నే అతి పెద్ద నగరము. ప్రపంచం లో ని అతి పెద్ద నగరములోనే ఇది ద్వితీయము.



విజయనగర సామ్రాజ్యం లో ని కొన్ని అతి ముఖ్యమైన కట్టడాలు:






విరూపాక్షుని ఆలయం: హంపి నగర కేంద్ర బిందువు. పంపాపాటి ఆలయం గా కూడా ప్రసిద్ధి చెందినది. 13 - 17 శతాబ్దాలలో విస్తరణ చెందినది. 50 అడుగుల ఎత్తు గల గోపురం తూర్పు ముఖం గా ఉన్నది. ఎదురుగా ఉన్నా రహదారి పై 1 కి. మీ దూరాన నంది విగ్రహం కలదు.

కృష్ణాలయం: హేమకూట శిఖరం పై కొలువుదీరినది.

Sunday, November 30, 2008

Naidu/Kapu/Balija Sanghams Addresses

Andhra Pradesh Kapu Telaga Balija Society
1-2-605/2/a, Lower Tank Bund Road
Opp. Vaartha OfficeHyderabad - 80
Ph: 040 - 2761 2388

The nearest landmark is SnowWorld. There's a college near snowworld and the society is in the college campus.

Saturday, November 29, 2008

నాయుడు/కాపు/బలిజ/తెలగ/వంటరి

శ్రీ విష్ణు పాద పద్మ సేవయు సద్గురు భక్తి పారాయణుల్ బలిజ వారు
తిరుమంత్ర నిష్టయు దేహతత్త్వములాడి పరతత్త్వకోవిదుల్ బలిజ వారు
పదపడి బ్రహ్మాండ భాండ మట్టండయిన పల్కి బొంకని వారు బలిజ వారు
బలిజ వారిది భూమి బలుసమై వ్రాసి ఇసుక ముప్పిరిత్రాడు వెయ్యంగ నేర్చి
కలిమి బలములకేల్ల ఘన పుణ్య రాశి కలనైన ధర్మముల్ ఘనత తో జేసి
అయ్యవాలీ ముఖ్యమైనట్టి వారు కయ్యమందున కాలు కదిలించ బోరు
నేయ్యమందు మహా నేర్పు గల వారు
దివ్యతుల యాభై ఆరు దేశాల వారు బలిజ వారు

-------------------------------------------------------------------------------------------------

చంద్ర వంశ బలిజ క్షత్రియులుబలిజ వంశోత్పత్తి వివిరణము.భాగవతము, నవమస్కంధము ౨౩ వ అధ్యాయముశ్రీ శుక వువాచ.
"అనో: సభానరస్చక్షు: పరోక్షశ్చత్రయ స్సుతా:,సభానరాత్ కాలనరః సృన్జయంత త్సుతస్తత:.జనమేజయ స్తస్యపుత్రో మహాశీలో మహామనాః,ఉశీనరస్తితిక్షుశ్చ మహామనస ఆత్మజౌ.శిబిర్వన స్సమిర్దక్షశ్చత్వారోశీనరాత్మజాః,వృషాదర్భః సువీరశ్చ మద్ర: కైకయ ఆత్మజాః.శిబే శ్చత్వార ఏవా సం స్తితిక్షోశ్చ రుసద్ర థః,తతో హేమో థసుతపా బలి: సుతపసో భవత్.అంగ వంగ కళింగాద్యాః సింహపున్ద్రాంధ్ర సంజ్నితా:,జజ్ఞి రే దీర్ఘ తమసో బలే: క్షేత్రే మహీక్షిత:.చక్రు: స్వనామ్నా విషయాన్ శడిమాన్ ప్రాచ్యకాంశ్చ తే."
తాత్పర్యం: యయాతి మహారాజునకు కొడుకైన అనువునకు సభానరుడు, చక్షుస్సు, పరోక్షుడు అను మువ్వురు పుట్టిరి. సభానరునికి కాలనరుడును, కాలనరునకు సృంజయుండును, సృన్జయునకు పురంజయుడును, పురంజయునకు జనమేజయుడును, జనమేజయునకు మహాశీలుమ్డును, మహాసీలునకు మహా మనస్సును పుట్టిరి. మహా మనస్సునకు ఉసీనరుడు, తితిక్షువు అని యిర్వురు కొడుకులు పుట్టిరి. ఉసీరునకు శిబి, వన, శమి, దక్షుడు అని నల్వురు పుట్టిరి. శిబికి వృషాదర్భ, సువీర, మద్ర, కేకయ అని నల్వురు కలరు. తితిక్షువునకు రుశద్రదుడును, వానికి హేముడును, వానికి సుతపుడును, వానికి బలి యును పుట్టిరి. బలి యొక్క క్షేత్రమునందు దీర్ఘతముడను ఋషి వలన అంగ, వంగ, కళింగ, సింహళ, పుండ్ర, ఆంధ్ర, అను వారార్గురు జన్మించి, ఈ భూమిని భాగించుకుని వారి వారి దేశములకు వారి వారి పేరుల నుంచిరి.
అది మొదలు అంగాది దేశములు ఆరు అయ్యెను.
సుతపుడను మహారాజునకు బహుకాలము సంతానము లేనందున అనేకములైన బలులను, యాగాములను చేయగా నొక్క కుమారుడు బలి కల్గెను. ఆ బలివలన పుట్టినవారైన అంగ, వంగ, కళింగ, సింహళ, పుండ్ర, ఆంధ్రులు అనువారు బలిజవారైరి. అనగా, బలి: = బలియను వానికి, జ: = పుట్టినవారు అని వ్యుత్పత్తి.
బలి కొమరుడైన ఆంధ్రుడు మగధ దేశమునకు రాజైనాడు. వీని వంశీయులు మహా పరాక్రమ శాలురై ౪౬౦ సంవత్సరములు హిమాచలము ఉజ్జయిని వంగ దేశము ఆనెగొంది..... ఈ సరిహద్దులలో గల దేశమును పాలించియుండిరి.

------------------------------------------------------------------------------------------------

శ్రీనాధుని చాటువులు:


గుబ్బలగుమ్మ లే జిగురు గొమ్మ సువర్ణపు గీలుబొమ్మ బల్
గబ్బి మిటారి చూపులది కాపు ది దానికి నేల

యొక్కనిన్ బెబ్బులి నంటగట్టితివి పెద్దవు నిన్ననరాదు గాని

దా నబ్బ పయోజగర్భ మగనాలికి నింత విలాస మేటికిన్


పస గల ముద్దు మోవి బిగి వట్రువ గుబ్బలు మందహాసమున్
నొసట విభూతిరేఖయు బునుంగున తావి మిటారి

చూపులున్ రసికులు మేలు మేలు బళిరా యని మెచ్చగ

రాచవీటిలో బసిడి సలాక వంటి యొక బల్జె వధూటిని గంటి వేడుకన్