తిరుమంత్ర నిష్టయు దేహతత్త్వములాడి పరతత్త్వకోవిదుల్ బలిజ వారు
పదపడి బ్రహ్మాండ భాండ మట్టండయిన పల్కి బొంకని వారు బలిజ వారు
బలిజ వారిది భూమి బలుసమై వ్రాసి ఇసుక ముప్పిరిత్రాడు వెయ్యంగ నేర్చి
కలిమి బలములకేల్ల ఘన పుణ్య రాశి కలనైన ధర్మముల్ ఘనత తో జేసి
అయ్యవాలీ ముఖ్యమైనట్టి వారు కయ్యమందున కాలు కదిలించ బోరు
నేయ్యమందు మహా నేర్పు గల వారు
దివ్యతుల యాభై ఆరు దేశాల వారు బలిజ వారు
-------------------------------------------------------------------------------------------------
చంద్ర వంశ బలిజ క్షత్రియులుబలిజ వంశోత్పత్తి వివిరణము.భాగవతము, నవమస్కంధము ౨౩ వ అధ్యాయముశ్రీ శుక వువాచ.
"అనో: సభానరస్చక్షు: పరోక్షశ్చత్రయ స్సుతా:,సభానరాత్ కాలనరః సృన్జయంత త్సుతస్తత:.జనమేజయ స్తస్యపుత్రో మహాశీలో మహామనాః,ఉశీనరస్తితిక్షుశ్చ మహామనస ఆత్మజౌ.శిబిర్వన స్సమిర్దక్షశ్చత్వారోశీనరాత్మజాః,వృషాదర్భః సువీరశ్చ మద్ర: కైకయ ఆత్మజాః.శిబే శ్చత్వార ఏవా సం స్తితిక్షోశ్చ రుసద్ర థః,తతో హేమో థసుతపా బలి: సుతపసో భవత్.అంగ వంగ కళింగాద్యాః సింహపున్ద్రాంధ్ర సంజ్నితా:,జజ్ఞి రే దీర్ఘ తమసో బలే: క్షేత్రే మహీక్షిత:.చక్రు: స్వనామ్నా విషయాన్ శడిమాన్ ప్రాచ్యకాంశ్చ తే."
తాత్పర్యం: యయాతి మహారాజునకు కొడుకైన అనువునకు సభానరుడు, చక్షుస్సు, పరోక్షుడు అను మువ్వురు పుట్టిరి. సభానరునికి కాలనరుడును, కాలనరునకు సృంజయుండును, సృన్జయునకు పురంజయుడును, పురంజయునకు జనమేజయుడును, జనమేజయునకు మహాశీలుమ్డును, మహాసీలునకు మహా మనస్సును పుట్టిరి. మహా మనస్సునకు ఉసీనరుడు, తితిక్షువు అని యిర్వురు కొడుకులు పుట్టిరి. ఉసీరునకు శిబి, వన, శమి, దక్షుడు అని నల్వురు పుట్టిరి. శిబికి వృషాదర్భ, సువీర, మద్ర, కేకయ అని నల్వురు కలరు. తితిక్షువునకు రుశద్రదుడును, వానికి హేముడును, వానికి సుతపుడును, వానికి బలి యును పుట్టిరి. బలి యొక్క క్షేత్రమునందు దీర్ఘతముడను ఋషి వలన అంగ, వంగ, కళింగ, సింహళ, పుండ్ర, ఆంధ్ర, అను వారార్గురు జన్మించి, ఈ భూమిని భాగించుకుని వారి వారి దేశములకు వారి వారి పేరుల నుంచిరి.
అది మొదలు అంగాది దేశములు ఆరు అయ్యెను.
సుతపుడను మహారాజునకు బహుకాలము సంతానము లేనందున అనేకములైన బలులను, యాగాములను చేయగా నొక్క కుమారుడు బలి కల్గెను. ఆ బలివలన పుట్టినవారైన అంగ, వంగ, కళింగ, సింహళ, పుండ్ర, ఆంధ్రులు అనువారు బలిజవారైరి. అనగా, బలి: = బలియను వానికి, జ: = పుట్టినవారు అని వ్యుత్పత్తి.
బలి కొమరుడైన ఆంధ్రుడు మగధ దేశమునకు రాజైనాడు. వీని వంశీయులు మహా పరాక్రమ శాలురై ౪౬౦ సంవత్సరములు హిమాచలము ఉజ్జయిని వంగ దేశము ఆనెగొంది..... ఈ సరిహద్దులలో గల దేశమును పాలించియుండిరి.
------------------------------------------------------------------------------------------------
శ్రీనాధుని చాటువులు:
గుబ్బలగుమ్మ లే జిగురు గొమ్మ సువర్ణపు గీలుబొమ్మ బల్
గబ్బి మిటారి చూపులది కాపు ది దానికి నేల
యొక్కనిన్ బెబ్బులి నంటగట్టితివి పెద్దవు నిన్ననరాదు గాని
దా నబ్బ పయోజగర్భ మగనాలికి నింత విలాస మేటికిన్
పస గల ముద్దు మోవి బిగి వట్రువ గుబ్బలు మందహాసమున్
నొసట విభూతిరేఖయు బునుంగున తావి మిటారి
చూపులున్ రసికులు మేలు మేలు బళిరా యని మెచ్చగ
రాచవీటిలో బసిడి సలాక వంటి యొక బల్జె వధూటిని గంటి వేడుకన్
1 comment:
Hiii sasi
chala baga chesavu Balija community ,keep it up
Post a Comment