
పసుపులేటి రమేష్ నాయుడు 1970వ మరియు 80వ దశకములో సుప్రసిద్ద తెలుగు సినీ సంగీత దర్శకుడు. ఆయన సృష్టించిన పాటలు రాశి తక్కువైనా వాసి ఎక్కువ. ఆయన సంగీతము సమకూర్చిన మేఘసందేశం చిత్రంలోని పాటలు సంగీత పరంగా చాలా ప్రసిద్ధి గాంచినవి.
రమేష్ నాయుడు 1933లో కృష్ణా జిల్లా, కొండపల్లిలో జన్మించాడు. యుక్తవయసులో ఇల్లు వదిలి బొంబాయికి పారిపోయి ఒక సంగీత వాయిద్యాలమ్మే దుకాణములో పనిచేశాడు. అక్కడ ఆయనకు వివిధ రకాల సంగీత వాయిద్యాలు వాయించే అవకాశం దొరికింది. అక్కడే ఆ అంగడికి వచ్చే వివిధ హిందీ సంగీత దర్శకులతో పరిచయాలు ఏర్పరచుకొనే అవకాశం కూడా కలిగింది. ఈయన 16యేళ్ళ వయసులో సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమా బంద్వల్ పహీజా అనే మరాఠీ సినిమా.
ఈయనను తెలుగులో సి.కృష్ణవేణి నిర్మించిన దాంపత్యం సినిమాతో తెలుగు చిత్రరంగానికి పరిచయం చేసింది. ఆ సినిమా తరువాత మనోరమ (ఈ చిత్రం లో ప్రముఖ హిందీ గాయకుడు తలత్ మెహమూద్ తో రెండు పాటలు పాడించారు)లాంటి ఒకటి రెండు తెలుగు సినిమాలలో పనిచేసి 60వ దశకము ప్రారంభము కళ్ళా తిరిగి బొంబాయి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి కలకత్తాకు మారి అనేక బెంగాళీ చిత్రాలకు పనిచేసి అక్కడే ఒక బెంగాళీ యువతిని పెళ్ళిచేసుకున్నాడు. 10 సంవత్సరాల పాటు అనేక బెంగాళీ, నేపాలీ మరియు ఒరియా సినిమాలకు సంగీతము అందించాడు.
తెలుగులో రమేష్ నాయుని పునఃప్రవేశం 1972లో విడుదలైన శోభన్ బాబు చిత్రం అమ్మమాట తో జరిగింది. ఆ తరువాత ఆయన తెలుగు సినిమాలలో కొనసాగాడు. 1970 మరియు 80లలో ఈయన ప్రతిభను పూర్తి స్థాయిలో వినియోగించుకొని తెలుగు సినీ రంగానికి కొన్ని అత్యుత్తమ మధురగీతాలను అందించిన దర్శకులలో దాసరి నారాయణరావు, విజయ నిర్మల మరియు జంధ్యాల ప్రధానమైన వారు.
రమేష్ నాయుడు గీతాలను తీసుకొని వాటికి మధురమైన బాణీలు కట్టేవాడు. ఇలాంటి శైలిలో పనిచేసే అతికొద్ది సంగీత దర్శకులలో కె.వి.మహదేవన్ తో పాటు ఈయనా ఒకడు. వేటూరి సుందరరామ్మూర్తి తెలుగు సినీ సంగీతదర్శకులు మరియు దర్శకులతో తన అనుబంధము గురించి రచించిన కొమ్మ కొమ్మకో సన్నాయి పుస్తకంలో కె.వి.మహదేవన్, ఎన్టీ రామారావు, ఆత్రేయ, బాలు, ఇళయరాజా వంటి వారికి ఒక్కొక్క అధ్యాయము కేటాయించగా రమేష్ నాయుడు ఒక్కనికే రెండు అధ్యాయములు కేటాయించాడు.
రమేష్ నాయుడు హిందీ చిత్రరంగానికి లక్ష్మీకాంత్-ప్యారేలాల్ ను పరిచయం చేశాడు. మణిశర్మ తండ్రి యనమండ్ర నాగయజ్ఞశర్మ రమేష్ నాయుని ఆర్కెస్ట్రాలో శాశ్వత సభ్యుడు. ఈయన చివరి చిత్రం కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వయంకృషి. ఈ సినిమా విడుదలయ్యే ముందు రోజే 1987, సెప్టెంబర్ 3న మరణించాడు.
చిత్రమాలిక:
- అహ! నా పెళ్ళంట !
- ఆశాజ్యోతి
- అద్దాలమేడ
- రెండుజెళ్ళ సీత
- అల్లరి బావ
- అమృతకలశం
- అందాలరాశి
- అంతం కాదిది ఆరంభం
- అంతులేని వింతకధ
- బంగారక్క
- బంట్రోతు భార్య
- భద్రకాళి
- ఒకమ్మాయి
- భోళా శంకరుడు
- భోగిమంటలు
- చలాకీ చెల్లెమ్మ
- కలెక్టర్ విజయ
- దాంపత్యం
- దేవదాసు మళ్లీ పుట్టాడు
- దేవదాసు (1974 సినిమా)
- దేవుడే గెలిచాడు
- దేవుడు చేసిన మనుషులు
- ధైర్యవంతుడు
- గంగ మంగ
- హేమా హేమీలు
- ఇల్లే స్వర్గం
- కల్యాణి (1979)
- ఖైదీ కృష్ణుడు
- కొత్తనీరు (1982)
- శివరంజని
- శ్రీవారి శోభనం
- శ్రీవారికి ప్రేమలేఖ
- కుడి ఎడమైతే
- కూతురు కాపురం
- మాకు స్వతంత్రం వచ్చింది
- మహాలక్ష్మి
- ముద్దబంతి పువ్వు
- ముద్ద మందారం
- మీనా (1974 సినిమా)
- మేఘ సందేశం (సినిమా)
- మొగుడు పెళ్ళాలు
- నాగమల్లి నాలుగు స్తంభాలాట
- నీడ
- జయసుధ (సినిమా)
- వయ్యారి భామలు
- వగలమారి భర్తలు
- వీణ
- ప్రణయ గీతం
- ప్రేమ సంకెళ్ళు
- పసుపు పారాణి
- పెళ్ళి నీకు అక్షింతలు నాకు
- సుజాత (సినిమా)
- సూర్యచంద్రులు
- స్వయంకృషి
- తాతా మనవడు
- తాతయ్య ప్రేమలేఖలు
- తల్లి గోదావరి
- తూర్పు పడమర
- సత్యాగ్రహం
- చందన (సినిమా)
- మల్లె మొగ్గలు
- మల్లెల పందిరి
- మంచు పల్లకి
- జీవితం (1973 సినిమా)
- సంసారం-సాగరం
- సంఘం చెక్కిన శిల్పాలు
No comments:
Post a Comment