Saturday, February 28, 2009

కైకాల సత్యనారాయణ (25 జూలై 1935)


కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు మరియు భారత పార్లమెంటు సభ్యుడు. గత 40 సంవత్సరాలుగా తెలుగు సినిమాకి సేవ చేస్తున్న ఆయన ఇప్పటిదాకా 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందాడు.
సత్యనారాయణ కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో, కైకాల లక్ష్మీనారాయణకు 1935 జూలై 25 న జన్మించాడు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేసి, గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. 1960 ఏప్రిల్ 10 న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు మరియు ఇద్దరు కొడుకులు.
తన గంభీరమైన కాయంతో, కంచు కంఠంతో, సినిమాల్లో వేషాల కోసం సత్యనారాయణ మద్రాసు వెళ్ళాడు. ఆయన్ని మొదట గుర్తించింది డి.యల్.నారాయణ. 1959 లో నారాయణ సిపాయి కూతురు అనే సినిమాలో సత్యనారాయణకు ఒక పాత్ర ఇచ్చాడు. దానికి దర్శకుడు చంగయ్య. ఆ సినిమా బాక్సు ఆఫీసు దగ్గర బోల్తాపడినా సత్యనారాయణ ప్రతిభను గుర్తించారు. అలా గురించటానికి ఆసక్తి గల కారణం, ఆయన రూపు రేఖలు యన్.టి.ఆర్ ను పోలి ఉండటమే. యన్.టి.ఆర్ కు ఒక మంచి నకలు దొరికినట్లు అయింది. అప్పుడే యన్.టి.ఆర్ కూడ ఈయన్ని గమనించారు. 1960 లో యన్.టి.ఆర్ తన సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి లో ఈయనకి ఒక పాత్రనిచ్చారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించినవారు యస్.డి.లాల్. ఈ సినిమాలో సత్యనారాయణ యువరాజు పాత్ర వేసాడు.
సత్యనారాయణను ఒక ప్రతినాయకుడుగా చిత్రించవచ్చు అని కనిపెట్టినది విఠలాచార్య. ఇది సత్యనారాయణ సినిమా జీవితాన్నే మార్చేసింది. విఠలాచార్య సత్యనారాయణ చేత ప్రతినాయకుడుగా కనక దుర్గ పూజా మహిమ లో వేయించాడు. ఆ పాత్రలో సత్యనారాయణ సరిగ్గా ఇమడటంతో, తర్వాతి సినిమాల్లో ఆయన ప్ర్రతినాయకుడుగా స్థిరపడి పోయాడు.
ప్రతినాయకుడిగా తన యాత్ర కొనసాగిస్తూనే, సత్యనారాయణ కారెక్టర్ పాత్రలు కూడా వేసారు. ఇది ఆయన్ని సంపూర్ణ నటుడిని చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు సత్యనారాయణ లాంటి ఒక విలక్షణ నటుడు దొరకటం ఒక వరం. ఈయన వెయ్యని పాత్ర అంటూ లేదు. ఆయన ఏపాత్ర వేసినా ఆ పాత్రలో జీవించాడు. ఆయన యమగోల మరియు యమలీల చిత్రాల్లో యముడిగా వేసి అలరించాడు. కృష్ణుడిగా, రాముడిగా యన్.టి.ఆర్ ఎలానో, యముడిగా సత్యనారాయణ అలా! ఎస్.వి.రంగారావు ధరించిన పాత్రలు చాలావరకు సత్యనారాయణ పోషించారు.పౌరాణికాల్లో రావణుడు,దుర్యోధనుడు,యముడు,ఘటోద్గచుడు సాంఘికాల్లో రౌడీ,కధానాయకుని (కథాకనాయిక) తండ్రి,తాత మొదలైనవి.
సత్యనారాయణ రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు సినిమాలు నిర్మించాడు.
1996 లో ఆయన రాజకీయాల్లోకి వచ్చి, మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి 11వ లోక్‌సభ కి ఎన్నికయ్యాడు.

కొమ్మారెడ్డి సావిత్రి (6 డిసెంబర్ 1937 - 26 డిసెంబర్ 1981)


తెలుగు చిత్రసీమలోన కళాభినేత్రి
కోకిలంటి కంఠమున్నసుమధుర గాత్రి
కన్నులతో కథలు చెప్పు విశాల నేత్రి
నీ నటనతోనె ధన్యమయ్యేనీ ధరిత్రి....

తెలుగు సినీ ప్రపంచం లో మహానటి, కొమ్మారెడ్డి సావిత్రి (1937 డిసెంబర్ 6 - 1981 డిసెంబర్ 26) . తెలుగు తమిళ సినిమాల్లో కూడా నటించి, మహానటి అనిపించుకుని, తరాల తరువాత కూడా ఆరాధింపబడుతూంది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో 1936 డిసెంబర్ 6 న నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది. తన ఆరవ యేటనే తండ్రిని కోల్పోవడము వల్ల పెదనాన్న సహాయముతో విజయవాడ లోని కస్తూరీబాయి మెమోరియల్ పాఠశాలలో మూడవ ఫారం (8వ తరగతి) వరకు చదువుకున్నది. శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం మరియూ శాస్త్రీయ నృత్యం నేర్చుకొని విజయవాడలో తన చిన్నతనంలోనే ప్రదర్శనలు ఇచ్చింది. కొంతకాలం ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసి, అనంతరం స్వయంగా పెదనాన్న నడిపిన నాట్య మండలిలో కూడా నటించింది. బుచ్చిబాబు రాసిన ఆత్మవంచన అనే నాటకంలో కూడా నటించింది.

పెదనాన్న ప్రోద్బలంతో సినిమా రంగం వైపు దృష్టి సారించి ఎన్నో కష్టాలనోర్చి తిరుగులేని అభినేత్రి గా విరాజిల్లింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం సినిమాలో చిన్న పాత్ర పొంది, ఆనక ఆ పాత్రకు తగ్గ వయసు లేదని అందులోనుండి తొలగింపబడింది. ఆ తరువాత కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన పాతాళ భైరవిలో ఒక చిన్న పాత్రలో నటించింది. పెళ్ళిచేసిచూడు ఆమె సినీ జీవితంలో ఒక మలుపు. కాని అందులో ఆమె రెండో కథానాయిక పాత్రకే పరిమితం కావలసి వచ్చింది. తన నటనా ప్రతిభను నిరూపించుకోవటానికి ఆమె, నృత్యరూపకుడు మరియూ దర్శకుడూ అయిన వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన దేవదాసు సినిమా వరకూ ఆగవలసి వచింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో మిస్సమ్మ లో ప్రధానపాత్ర పోషించింది. ఆ చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా స్థిరపడింది. ఆ తరువాత వచ్చిన దొంగరాముడు, అర్థాంగి, చరణదాసి ఆమె స్థానాన్ని పదిలపరచాయి.1957 లో వచ్చిన తెలుగు చిత్ర చరిత్ర లోనే అజరామరం అనదగిన మాయాబజార్ చిత్రంలో ఆమె ప్రదర్శించిన అసమాన నటనా వైదుష్యం ఆమె కీర్తి పతాకంలో ఒక మణిమకుటం.అది మొదలు యెన్నో వైవిధ్యమైన పాత్రలను తనకే సాధ్యమైన రీతిలో పోషించి వాటికి ప్రాణ ప్రతిష్ట చేసింది.
ఆమె తమిళచిత్రాలలోనూ నటించి, పేరుతెచ్చుకుంది. తమిళంలోనూ మహానటి (నడిగెయర్ తిలగం) బిరుదు పొందింది. 1968 లో చిన్నారి పాపలు సినిమాకు దర్శకత్వం వహించింది.ఈ సినిమా కు ఒక ప్రత్యేకత వుంది.బహుశా దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా దాదాపు పూర్తిగా మహిళలచే నిర్మింపబడిన చిత్రంగా ప్రత్యేకత సంతరించుకున్నది . అయితే అది అంత విజయం సాధించలేదు.ఆ తరువాత చిరంజీవి,మాతృదేవత,వింత సంసారం మొదలగు సినిమాలకు దర్శకత్వం వహించింది. 1956లో అప్పటికే రెండు పెళ్ళిళ్ళయిన తమిళ నటుడు జెమినీ గణేశన్ ను పెళ్ళిచేసుకుంది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు - విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్. అయితే ఆ పెళ్ళి విఫలమైంది. ఆస్తిపాస్తులు కోల్పోయి, తాగుడుకు, మత్తుమందులకు, నిద్రమాత్రలకు బానిసై, 1981 డిసెంబర్ 26 న మరణించింది.
మల్లెపూలు, వర్షం సావిత్రికి ఇష్టమైనవి. ఆమెది ఎడమచేతి వాటం. క్రికెట్, చదరంగం ఆటలను బాగా ఇష్టపడేది. చెన్నైలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆమె తప్పక చూసేది. వెస్టిండీస్ ప్రముఖ ఆటగాడు "గ్యారీ సోబర్స్" కు సావిత్రి అభిమాని. ఆ రోజుల్లోనే శివాజీగణేశన్ తోపాటు తారల క్రికెట్లో పాల్గొనేది. ఆమె వద్ద ఏనుగుదంతంతో చేసిన చదరంగం బల్లకూడా ఉండేది. సావిత్రి మంచి చమత్కారి, అంతే కాదు ఇతరులను అనుకరించటంలో కూడా దిట్ట. ఆమె తన భర్త జెమినీ గణేశన్ను, రేలంగిని, సరోజాదేవిని, ఎస్వీ రంగారావుని, ఇంకా అనేకమందిని తరుచూ అనుకరించేది. దానధర్మాల విషయంలో అమెది ఎముకలేని చెయ్యి. ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ని కలిసేందుకు వెళ్ళి, అక్కడ మొత్తం నగలన్నిటినీ వలిచి ప్రధానమంత్రి సహాయ నిధికి దానమిచ్చేసింది.
ఆమె సినిమాలు:
నటి గా
సంసారం (1950)
అగ్నిపరీక్ష (1951)
పాతాళభైరవి (1951)లో నృత్యకారిణి
పెళ్ళిచేసి చూడు (1952)లో సావిత్రి
పల్లెటూరు (1952)లో సుగుణ
ప్రతిజ్ఞ (1953)
దేవదాసు (1953)లో పార్వతి
బ్రతుకుతెరువు (1953)లో జమీందారుగారి కూతురు
మేనరికం (1954)
చంద్రహారం (1954)లో చంచల
బహుత్ దిన్ హుయే (1954) (హిందీ సినిమా)
పరివర్తన (1954)లో సుందరమ్మ వదిన
మిస్సియమ్మ (1955) (తమిళ సినిమా)
మిస్సమ్మ (1955)లో మేరీ/మహాలక్ష్మి
అర్ధాంగి (1955)
సంతానం (1955)లో శారద
కన్యాశుల్కం (1955)లో మధురవాణి
దొంగరాముడు (1955)లో సీత
చరణదాసి (1956)లో లక్ష్మి
భలేరాముడు (1956)
అమరదీపం (1956)లో అరుణ
వినాయకచవితి (1957)లో సత్యభామ/భూదేవి
తోడికోడలు (1957)లో
సుశీల ఎమ్మెల్యే(M.L.A.) (1957)లో నిర్మల
మాయాబజార్ (1957)లో శశిరేఖ
మాయాబజార్ (1957) (తమిళ సినిమా)లో శశిరేఖ
కర్పూరకరసి (1957) (తమిళ సినిమా)లో మంజుల
మాంగల్యబలం (1958)
అప్పుచేసి పప్పుకూడు (1958)లో మంజరి
నమ్మినబంటు (1959)
విమల (1960)
శ్రీవెంకటేశ్వరమహత్యం (1960)లో పద్మావతి
శాంతినివాసం (1960)
దీపావళి (1960)
చివరకు మిగిలేది (1960)లో పద్మ
పాపపరిహారం (1961)
పసమలార్ (1961) (తమిళ సినిమా)లో రాధ
పాండవవనవాసం (1961)లో ద్రౌపది
కలసివుంటే కలదుసుఖం (1961)
సిరిసంపదలు (1962)
పవిత్రప్రేమ (1962)
మనితన్ మరవిల్లై (1962) (తమిళ సినిమా)
మంచిమనసులు (1962)
ఆరాధన (1962)లో అనూరాధ
గుండమ్మ కథ (1962)లో లక్ష్మి
రక్తసంబంధం (1962)
ఆత్మబంధువు (1962)
రక్తతిలకం (1963)లో కమల
మూగ మనసులు (1963)లో రాధ
కర్ణలో (1963) భానుమతి
కర్ణన్ (1963) (తమిళ సినిమా)లో భానుమతి
ఘర్ బసాకే దేఖో (1963) (హిందీ సినిమా)
చదువుకున్న అమ్మాయిలు (1963)లో సుజాత
నర్తనశాల (1963)లో ద్రౌపది
వెలుగునీడలు (1964)లో సుగుణ
పూజాఫలం (1964)లో సీత
నవరాత్రి (1964)
కైకొడుత్తదైవం (1964) (తమిళ సినిమా)
గంగా కీ లెహరే (1964) (హిందీ సినిమా)
డాక్టర్ చక్రవర్తి (1964)లో మాధవీ దేవి
దేవత (1964)
సుమంగళి (1965)
తిరువిలయాదల్(1965) (తమిళ సినిమా)లో పార్వతి యొక్క వివిధ రూపాల్లో నటించింది.
నాదీ ఆడజన్మే (1965)
మనుషులు మమతలు (1965)
నవరాత్రి (1966)
భక్తపోతన (1966)లో సరస్వతీదేవి
ప్రాణమిత్రులు (1967)
వరకట్నం (1968)
తల్లితండ్రులు (1970)లో కౌసల్య
మరోప్రపంచం (1970)
అశ్వథ్థామ (1970)లో కుంజుని భార్య
జగన్మోహిని (1978)
అందరికంటే మొనగాడు (1985)
దేవదాసు మళ్లీ పుట్టాడు
గోరింటాకు (చివరి సినిమా)

నిర్మాతగా
ఏక్ చిట్టీ ప్యార్ భరీ(1985) (హిందీ సినిమా)
దర్శకురాలిగా
మాతృదేవత (1970)
ఇతరములు
నవరాత్రి (1966) సినిమాలో నేపథ్య గాయని

Friday, February 27, 2009

అల్లు రామలింగయ్య (1 అక్టోబర్ 1922 - 31 జూలై 2004)


అల్లు రామలింగయ్య పేరులోనే హాస్యం ఉంది. ఆయన హాస్యం మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించింది. చారిత్రక కాలంలో కవిత్వంలో పలు ప్రక్రియలు చేపట్టి కవ్వించి , నవ్వించి ' వికటకవి గా తెనాలి రామలింగడు చరితార్థుడైతే , ఈనాటి సినీసీమలో అలాంటి స్థాన్నాన్ని పొందినవాడు అల్లు రామలింగయ్య .
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో 1922 అక్టోబర్ 1 న అల్లు రామలింగయ్య జన్మించాడు. చదువు పెద్దగా అబ్బలేదు. తన సహచరులతో కలసి ఆకతాయిగా తిరుగుతూ అందరినీ అనుకరిస్తూ నవ్వించేవాడు. ఇదే క్రమంతో నాటకాల్లో నటించాలనే ఉత్సాహం పెరిగింది. ఊళ్లో కెవరు నాటకాల వాళ్ళు వచ్చినా వారి వెంటే తిరుగుతూ ఉండేవాడు. వాళ్లతో స్నేహం చేయడం, ఏదైనా చిన్న వేషం ఇమ్మని అడగడం నిత్యకృత్యంగా చేసుకున్నాడు. ఎట్టకేలకు భక్త ప్రహ్లాద నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది. అదీ మూడు రూపాయలు ఎదురిచ్చేట్టుగా ఇంట్లో వాళ్ళకి తెలియకండా వేసాడు. నాటకానుభవం పెద్దగా లేకున్నా కొద్దిపాటి నటనావగాహనతో తన వేషం మెప్పించాడు. ఆ తరువాత ఇంట్లోంచి బియ్యం దొంగతనం చేసి వాటిని అమ్మి నాటక కాంట్రాక్టరుకు ఇచ్చాడు. అలా మొదలైనంది ఆల్లు నట జీవితం.
అల్లు నాటకాల్లో నటిస్తూనే, తన సామాజిక బాధ్యతను గుర్తెరిగి గాంధీజీ పిలుపునందుకుని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు కెళ్లాడు. జైలులో కూడా తోటివారిని పోగేసుకుని నాటకాలాడేవాడు. మరోవైపు అంటరానితనంపై పోరు సలిపాడు.
చలనచిత్ర జీవితంఅల్లు నాటాకాలు చూసిన గరికపాటి రాజారావు చిత్రసీమలో తొలిసారిగా 1952 లో పుట్టిల్లు చిత్రంలో కూడు-గుడ్డ శాస్త్రి తరహ పాత్రను అల్లుచే వేయించాడు. ఆ తరువాత హెచ్.ఎం.రెడ్డి ' వద్దంటే డబ్బు ' లో అవకాశం వచ్చింది.
పుట్టిలు చిత్రం నిర్మాణకాలంలో తన భార్యా నలుగురు పిల్లలతో మదరాసుకు మకాం మార్చాడు. అల్లు తన కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టాలు పడ్డాడు. మరోవైపు హొమియో వైద్యం నేర్చుకున్న అల్లు ఏమాత్రం తీరిక దొరికినా ఉచితవైద్య సేవలందించేవాడు.
ప్రారంభంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో నిలద్రొక్కుకున్నడు. అల్లు హాస్యపు జల్లునేకాదు కామెడీ విలనిజాన్ని కూడా బగా రక్తికట్టించాడు. అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలలో ఆణిముత్యాలుగా చెప్పుకోదగ్గవి మూగమనసులు, దొంగరాముడు, మాయా బజార్,ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, అందాలరాముడు, శంకరాభరణం మొదలైనవి వున్నాయి. ముత్యాలముగ్గు సినిమా చిత్రీకరణకు ముందు ఆయన కుమారుడు ఆకస్మికంగా మరణించినా బాధను మనసులో అణుచుకుని షూటింగ్ లో పాల్గొన్న గొప్ప నటుడు అల్లు. సుమారు 1030 సినిమాల్లో కామెడీ విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేసాడు. 1116 చిత్రాల్లో నటించాలనే కోరిక ఆయనకు తీరలేదు. ఆతను అభినయించిన చాల పాటలకు బాలు గళం సరిగా అమరి పోయింది. ' మనుషులంతా ఒక్కటే ' చిత్రంలో 'ముత్యాలు వస్తావా అడిగిందీ ఇస్తావా అనే పాట అప్పట్లో హిట్.
అల్లు రామలింగయ్య నిర్మాతగా గీతా ఆర్ట్స్ బానర్ ని నెలకొల్పి ' బంట్రోతు భార్య ' దేవుడే దిగివస్తే , బంగారు పతకం చిత్రాలను నిర్మించాడు. చాలాకాలం తర్వాత అల్లు 90 దశకంలో ' డబ్భు భలే జబ్బు ' చిత్రం తీసాడు. రేలంగి, రమణారెడ్డి, కుటుంబరావు, బాలకృష్ణ వంటివారి కాలంతో మొదలు ఈతరం హాస్యనటులు వరకూ కొనసాగిన ఏకైక హాస్యనటుడు అల్లునే. ' ఆమ్యామ్య.. అప్పుం అప్పుం ' లాంటి ఊతపదాలు అతను సృష్టించినవే.
పురస్కారాలు, సన్మానాలుయాబైయేళ్లపాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ యావత్ తెలుగు ప్రజానీకాన్ని అలరించిన అల్లును వరించిన సన్మానాలు, గౌరవాలు, , అవార్డులు అసంఖ్యాకమైనవి. భారత ప్రభుత్వం 1990 లో ' పద్మశ్రీ ' అవార్డు తో గౌరవించింది. రేలంగి తరువాత ' పద్మశ్రీ' అందుకున్న హాస్యనటుడు అల్లునే.
2001 వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత ' రఘుపతి వెంకయ్య ' అవార్డు ఇచ్చింది. పాలకొల్లులో ఆయన విగ్రహం నెలకొల్పారు. తన కోడుకు అల్లు అరవింద్ నిర్మాతగా స్థిరపడటం, అల్లుడు చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడం, మనవుడు అల్లు అర్జున్ హీరోగా మారడం అయనకు జీవితం లో సంతృప్తినిచ్చిన అంశాలు. అతని చివరి చిత్రం 'జై '
అల్లు రామలింగయ్య 2004 జూలై 31 వ తేదీన తన 82 వ ఏట కన్నుమూసాడు. మరణించేనాటికి తెలుగు చిత్రసీమలో అల్లురామలింగయ్యది ప్రత్యేక స్థానం. అతను భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన హాస్యం చిరంజీవిగా మనల్ని అలరిస్తూనే ఊంటుంది.
నటించిన సినిమాలుఇంద్ర (2002)

దేవుళ్ళు (2001)

మావిచిగురు(1996)

అల్లుడా మజాకా (1995)

ముఠామేస్త్రి (1993)

ఆ ఒక్కటి అడక్కు (1993)

మెకానిక్ అల్లుడు (1993)

పరుగో పరుగు (1993)

ఆపద్భాందవుడు (1992)

అశ్వమేధం(1992)

పెద్దరికం(1992)

రౌడీ అల్లుడు(1991)

నా పెళ్ళాం నా ఇష్టం (1991)

గ్యాంగ్ లీడర్(1991)

రాజా విక్రమార్క1990) కొదమ సింహం (1990)

జగదేక వీరుడు అతిలోక సుందరి(1990)

కొండవీటి దొంగ(1990) స్టేట్ రౌడీ(1989)

అత్తకు యముడు అమ్మాయికి మొగుడు(1989)

చలాకి మొగుడు చాదస్తపు పెళ్ళాం(1989)

ఖైదీ నెంబర్ 786(1988)

యముడికి మొగుడు(1988)

మంచి దొంగ(1988)

ఆఖరిపోరాటం(1988)

దొంగరాముడు(1988)

దొంగమొగుడు (1987)

చంటబ్బాయ్(1986)

మగధీరుడు(1986)

కిరాతకుడు(1986)

రావణబ్రహ్మ(1986)

విజేత(1985)

అడవిదొంగ(1985)

ఒకరాధ ఇద్దరు క్రిస్హనులు(1985)

జ్వాల(1985)

దొంగ (1985)

చట్టంతో పోరాటం(1985)

ముచ్చటగా ముగ్గురు(1985)


కోడి రామ్మూర్తి నాయుడు (1882-1942)



కోడి రామ్మూర్తి నాయుడు ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు మరియు మల్లయోధులు. ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు. కోడి వెంకన్న నాయుడు వీరి తండ్రి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేరణతో విజయనగరంలో తన పినతండ్రి కోడి నారాయణస్వామి దగ్గర పెరిగారు. అక్కడ ఒక వ్యాయమశాలలో చేరి దేహ ధారుడ్యాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నారు. 21 సంవత్సరాల వయసులోనే ఇతడు రొమ్ముపై 1 1/2 టన్నుల భారాన్ని మోసేవాడు. తరువాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగాడు. మద్రాసులో సైదాపేట కాలేజిలో ఒక సంవత్సరం వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని విజయనగరానికి తిరిగి వచ్చి విజయనగరం ప్రొవిన్షియల్ లోయర్ సెకండరీ పాఠశాలలో వ్యాయమ శిక్షణోపాధ్యాయునిగా పని చేశారు. తరువాత ఒక సర్కస్ సంస్థను స్థాపించి తన బలప్రదర్శనతో దేశ విదేశాలలో ప్రేక్షకులను అబ్బురపరిచారు.మన పురాణాలలో బల శబ్దానికి భీముడు, ఆంజనేయుడు పర్యాయ శబ్దాలైనట్లు ఆంధ్ర ప్రదేశంలో ఇతడి పేరు బలానికి పర్యాయపదంగా పరిగణించబడింది.

బలప్రదర్శన విశేషాలు:
గట్టిగా ఊపిరి పీల్చుకుని కండలు బిగించి, తన ఛాతీకి చుట్టిన ఉక్కు తాళ్ళను తెంచేవారు.
ఛాతీ మీదకు ఏనుగును ఎక్కించుకుని ఐదు నిముషాల పాటు నిలిపేవారు.
రెండు కార్లను వాటికి కట్టిన తాళ్ళు రెండు చేతులుతో పట్టుకుని కదలకుండా ఆపేవారు.

బిరుదులు:
ఆనాటి ఇంగ్లండు పాలకులైన కింగ్ జార్జ్, క్వీన్ మేరీలు రామ్మూర్తి నాయుడి బల ప్రదర్శనకు అబ్బురపడి, 'ఇండియన్ హెర్క్యులెస్' అనే బిరుదును ప్రసాదించారు. ఇంకా కలియుగ భీమ, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ వంటి బిరుదులను కూడా సొంతం చేసుకున్నరు.

http://www.hindu.com/thehindu/mp/2002/08/12/stories/2002081200920200.htm
విశాఖ సముద్ర తీరాన కోడి రా'మ్మూర్తి' !

Sunday, February 22, 2009

రఘుపతి వెంకయ్య నాయుడు (దిది.నెనె.సంసం - 15 march 1941 )




తెలుగు చలనచిత్ర రంగానికి పితామహుడు శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు గారు. ఈయన ప్రసిద్ధ సంఘసంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడుగారి సోదరుడు.
నాయుడుగారి స్వస్థానం మచిలీపట్నం .1886లో తన 17వ ఏట వెంకయ్య ఫొటోలు తీయడం మొదలుపెట్టాడు. 1910లో ఒక 'క్రోమో మెగాఫోను'ను, 4000 అడుగుల ఫిలిమ్‌ను విదేశాలనుండి తెప్పించుకొని వాటిని ప్రదర్శించడం ఆరంభించారు. ఒక టూరింగ్ టెంట్ ద్వారా ప్రదర్శనలిస్తూ ఆయన అప్పటి మూగసినిమాలకు సంగీతం వంటి ఆకర్షణలు జోడించేవాడు.
1912లో మద్రాసు లో 'గెయిటీ' అనే సినిమా థియేటర్ (ప్రదర్శన శాలను) నిర్మించారు. తరువాత 'క్రౌన్', 'గ్లోబ్' సినిమాహాళ్ళను కూడా నిర్మించారు. తన కుమారుడు ఆర్.ఎస్. ప్రకాష్ ను సినిమా నిర్మాణం నేర్చుకోవడానికి విదేశాలు పంపాడు. ప్రకాష్ జర్మనీ, ఇటలీ , అమెరికా దేశాలు పర్యటించాడు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్శకుడు 'సిసిల్ బి డెమిల్లి' (Ceicil B.Demille) 'టెన్ కమాండ్‌మెంట్స్'(Ten Commandments) చిత్రాన్ని నిర్మిస్తున్నపుడు ప్రకాష్ ఆయన క్రింద కొంతకాలం పనిచేశాడు.

ప్రకాష్ తిరిగి వచ్చిన తరువాత ఈయన దక్షిణభారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ 'Star of the East' ను స్థాపిచాడు. 1921లో "భీష్మప్రతిజ్ఞ" మూగచిత్రాన్ని నిర్మించారు (ఇది మూగచిత్రం గనుక "మొదటి తెలుగువాడి సినిమా" అనడం ఉచితం). ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించారు. 'డి కాస్టెల్లో'(De Castello)అనే ఆంగ్లయువతి గంగ పాత్రను ధరించింది. తరువాత ఈ తండ్రీకొడుకులు "మత్స్యావతార్", "నందనార్", "గజేంద్రమోక్షం" వంటి మరికొన్ని మూగసినిమాలను తీశారు. తరువాత ప్రసిద్ధులైన సి.పుల్లయ్య, వై. వీ. రావు లు ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
తరువాత తమిళ సినిమా నిర్మాత ఎ.నారాయణన్‌తో కలిసి 'గ్యారంటీడ్ పిక్చర్స్ కార్పొరేషన్' , 'జనరల్ ఫిల్మ్ కార్పొరేషన్' స్థాపించారు. విశ్వామిత్ర, "విశ్వామిత్ర", "మాయామధుసూదన" , "పాండవ నిర్వహణ", "రాజ్ ఆఫ్ రాజస్థాన్" వంటి మరికొన్ని మూగసినిమాలు తీశారు.
1941 లో తన 69వ ఏట రఘుపతి వెంకయ్య మరణించారు. అప్పులవారికి చాలామొత్తాలు చెల్లించవలసినందున ఆయన చివరికాలానికి ఏమీ ఆస్తి మిగలలేదు అంటారు.
తెలుగు చలనచిత్ర పితామహుడు అయిన రఘుపతి వెంకయ్య పేరుమీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు ను స్థాపించింది.
వెంకయ్య తరువాత ప్రకాష్ తన సినీ ప్రయోగాలను మరింత ముందుకు తీసుకొని వెళ్ళారు. వెల్లవేసిన తెల్లటి గోడమీద సినిమా 'ప్రొజెక్ట్' చేసేవాడు. అలా దానిని 'గోడమీది బొమ్మ' అనేవారు. ప్రకాష్ కాకినాడ దగ్గర "భక్త మార్కండేయ" సినిమా తీశారు. అందులో కాకినాడ రాజారత్నం అనే ఆవిడ ఒక ముఖ్యపాత్ర ధరించింది. ఈమే తెలుగు సినిమాకు మొదటి కధానాయిక.


ప్రముఖ నటి దేవిక వెంకయ్య నాయుడు గారి మనవరాలే.





జీ. వరలక్ష్మి (1926 - 2006):



గరికపాటి వరలక్ష్మి గారు ఒంగోలు నందు జన్మించారు. "ద్రోహి" చిత్రం లో అహంభావి కుమార్తె గా, "లేత మనసులు" చిత్రం లో పొగరుబోతు తల్లి గా ప్రాచుర్యం పొందారు. నాటక రంగం పై మక్కువ తో పదకొండవ ఏట నే విజయవాడ చేరుకున్నారు. పద్నాలుగవ ఏట మొట్టమొదటి సారిగా చిత్రసీమ కి "బారిష్టరు పార్వతీశం", "బొండాం పెళ్లి" చిత్రాల ద్వారా పరిచయం అయ్యారు.
నలభై, యాభై దశకాల్లో పేరు పొందిన కథానాయకుల అందరి సరసన నటించారు.

ఫిల్మోగ్రఫీ:
గోరంత దీపం, 1978
అతవారిల్లు, 1976
సంసారం సాగరం, 1973
బుద్ధిమంతుడు, 1969
నిండు హృదయాలు, 1969
బంగారు పిచ్చుక , 1967
లేత మనసులు, 1966
అంతస్తులు, 1965
సుమంగళి, 1965
కుల గోత్రాలు, 1962
ఇద్దరు మిత్రులు, 1961
రాజ నందిని, 1958
మాంగల్య బలం, 1958
దొంగల్లో దొర, 1957
కర్పూరకరసి, 1957
మేలుకొలుపు, 1956
నాన్ పెట్ర సెల్వం, 1956
గులేబకావళి, 1955
అంటే కావాలి, 1955
మా గోపి, 1954
మేనరికం, 1954
కన్నా తల్లి, 1953
నా చెల్లెలు, 1953
పరోపకారం, 1953
మానవతి, 1952
పెళ్లి చేసి చూడు, 1952
దీక్ష, 1951
నిర్దోషి, 1951
నిరబరధి, 1951
మాయ రంభ, 1950
మొదటి రాత్రి, 1950
శ్రీ లక్ష్మమ్మ కథ, 1950
స్వప్న సుందరి, 1950
వింధ్యరాణి, 1948
ద్రోహి, 1948
భక్త ప్రహ్లాద, 1942
దక్షయజ్ఞం, 1941
బొండం పెళ్లి, 1940
బారిష్టరు పార్వతీశం, 1940

ఎస్.వి. రంగారావు (3 July 1918 – 18 July 1974):

సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. నట యశస్వి గా పేరు పొందిన ఈ నటుడు మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి ఘటోత్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతి గడించాడు. ఆయా పాత్రలలో ఆయన ఎంత మమేకమై పొయ్యరంటే, వేరెవరు కూడా ఆ పాత్రలలో ఇప్పటివరకు అంతగా ఇమడ లేకపొయ్యారు.
కృష్ణా జిల్లా లోని నూజివీడు లో 1918 జూలై 3 వ తేదీన లక్ష్మీ నరసాయమ్మ, కోటేశ్వరరావులకు ఎస్వీ రంగారావు జన్మించాడు. తండ్రి ఎక్సైజు శాఖలో పనిచేసేవాడు. యస్.వి.రంగారావు హిందూ కాలేజిలో చదివాడు. డిగ్రీ వరకూ చదివి, అగ్నిమాపక దళంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ, షేక్స్‌పియర్ ఆంగ్ల నాటకాలలో ఒథెల్లో, షైలాక్ తదితర పాత్రలు పోషించి ప్రముఖ రంగస్థల కళాకారుడిగా విశేష ఖ్యాతి గడించాడు. ఆ తర్వాత బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన "వరూధిని" చిత్రంలో ప్రవరాఖ్యుడిగా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యాడు.
ఆ తర్వాత "మనదేశం", "పల్లెటూరి పిల్ల", "షావుకారు", "పాతాళభైరవి", "పెళ్ళి చేసి చూడు", "బంగారుపాప", "బాలనాగమ్మ", "గృహలక్ష్మి", "బాల భారతం", "తాతా మనవడు" ఇలా అనేక చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనాచాతుర్యంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాడు.
నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ను గౌరవించారు. ఎస్వీయార్ నటించిన నర్తనశాల ఇండొనేషియాలోని జకార్తా లో ఆఫ్రో-ఆసియా చిత్రోత్సవము‍లో ప్రదర్శించబడడమే కాకుండా కీచకపాత్రకుగాను ఎస్వీయార్ ఉత్తమ నటుడు బహుమతి పొందాడు. కొన్ని చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన "చదరంగం" చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ బహుమతి, నగదు పారితోషికం లభించాయి.
అద్భుత నటనకు ప్రతీకగా నిల్చిన ఎస్వీ రంగారావు 1974 జూలై 18వ తేదీన మద్రాసు లో శాశ్వతంగా కన్నుమూశాడు.
వ్యక్తిగా రంగారావు సహృదయుడు, చమత్కారి. ఆయన ఇష్టదైవం శివుడు. ప్రతిరోజూ శివపూజ చేసిన తర్వాత దినచర్య ప్రారంభించేవాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెల పేర్లు విజయ, ప్రమీల. కొడుకు పేరు కోటేశ్వర రావు.
యస్వీఆర్ ఒక రకమయిన వేదాంతి. ఆయన ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి. ఆయన గొప్ప దాత. ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చాడు. చైనాతో యుద్ధం వచ్చినపుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయలు విరాళం ఇచ్చాడు. తర్వాత పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చినపుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి, మిగతా నటులతో కలసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి, విరాళాలు సేకరించి, ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చాడు.
బిరుదులు:
విశ్వనటచక్రవర్తి
నటసార్వభౌమ
నటశేఖర
నటసింహ
నటించిన చిత్రాలు
ఆయన నటంచిన చిత్రాలు అనేకం. అందులో కొన్ని .
1940
వరూధిని(1946)
మన దేశం(1948)
1950
పల్లెటూరి పిల్ల
షావుకారు
తిరుగుబాటు
1951
ఆకాశరాజు
పాతాళభైరవి
1952
దాసి
పెళ్ళిచేసి చూడు
పల్లెటూరు
1953
బ్రతుకు తెరువు
చండీరాణి
దేవదాసు
పరదేశి
పెంపుడు కొడుకు
రోహిణి
1954
అంతా మనవాళ్ళే
జాతకఫలం
అన్నదాత
రాజు-పేద
రాజీ నా ప్రాణం
సంఘం
చంద్రహారం
1955
బంగారుపాప
అనార్కలి
మిస్సమ్మ
జయసింహ
సంతానం
1956
కనకతార
చింతామణి
హరిశ్చంద్ర
చరణదాసి
1957
తోడికోడళ్ళు
సతీ సావిత్రి
మాయాబజార్
అల్లావుద్దీన్ అద్భుతదీపం
సారంగధర
రేపు నీదే
1958
బొమ్మల పెళ్ళి
భూకైలాస్
చెంచులక్ష్మి
పెళ్ళినాటి ప్రమాణాలు
1959
కృష్ణలీలలు
మాంగల్య బలం
అప్పుచేసి పప్పుకూడు
జయభేరి
రేచుక్క పగటిచుక్క
బాలనాగమ్మ
భక్త అంబరీష
సౌభాగ్యవతి
1960
నమ్మిన బంటు
మహాకవి కాళిదాసు
దీపావళి
భట్టి విక్రమార్క
మామకు తగ్గ అల్లుడు
దేవాంతకుడు
1961
వెలుగు నీడలు
కృష్ణ ప్రేమ
సతీసులోచన
ఉషాపరిణయం
కలసి ఉంటే కలదు సుఖం
1962
గాలిమేడలు
టైగర్ రాముడు
పెళ్ళి తాంబూలం
మంచి మనసులు
దక్షయజ్ఞం
గుండమ్మకథ
ఆత్మబంధువు
పదండి ముందుకు
విషబిందువు
1963
నర్తనశాల
తోబుట్టువులు
1964
మురళీకృష్ణ
రాముడు భీముడు
బొబ్బిలి యుద్ధం
1965
నాదీ ఆడజన్మే
పాండవ వనవాసం
తోడు నీడ
సతీ సక్కుబాయి
ఆడబ్రతుకు
1966
మొనగాళ్ళకు మొనగాడు
ఆటబొమ్మలు
శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ
చిలకా గోరింక
సంగీత లక్ష్మి
భక్త పోతన
అడుగు జాడలు
మోహినీ భస్మాసుర
1967
భక్త ప్రహ్లాద
చదరంగం
గృహలక్ష్మి
లక్ష్మీనివాసం
పుణ్యవతి
రహస్యం
సుఖదుఃఖాలు
వసంతసేన
1968
బాంధవ్యాలు
బందిపోటు దొంగలు
భలే కోడళ్ళు
చిన్నారి పాపలు
కుంకుమ భరిణ
రాము
వీరాంజనేయ
1969
జగత్ కిలాడీలు
మామకుతగ్గ కోడలు
మూగనోము
బందిపోటు భీమన్న
1970
సంబరాల రాంబాబు
జగత్ జెట్టీలు
ఇద్దరు అమ్మాయిలు
దేశమంటే మనుషులోయ్
బస్తీ కిలాడీలు
కిలాడి సింగన్న
1971
విక్రమార్క విజయం
అనురాధ
దెబ్బకు ఠా దొంగల ముఠా
రౌడీ రంగడు
భలేపాప
జాతకరత్న మిడతంభొట్లు
ప్రేమనగర్
శ్రీకృష్ణ సత్య
దసరా బుల్లోడు
శ్రీకృష్ణ విజయం
1972
శ్రీకృష్ణాంజనేయ యుద్ధం
పాపం పసివాడు
పండంటికాపురం
సంపూర్ణ రామాయణం
శాంతి నిలయం
విచిత్రబంధం
వంశోద్ధారకుడు
కత్తుల రత్తయ్య
కొడుకు కోడలు
బాలభారతం
1973
బంగారు బాబు
మరపురాని మనిషి
తాతా మనవడు
డబ్బుకు లోకం దాసోహం
రామరాజ్యం
రాముడే దేముడు
వారసురాలు
మైనరు బాబు
దేవుడు చేసిన మనుషులు
డాక్టర్ బాబు
1974
ప్రేమలూ పెళ్ళిళ్ళు
బంగారు కలలు
చక్రవాకం
గాలిపటాలు
అందరూ దొంగలే
యశోదకృష్ణ

పసుపులేటి కన్నాంబ (1912 - 7 మే 1964):







ప్రసిద్ద రంగస్థల నటి, గాయని, చలనచిత్ర కళాకారిణిగా తెలుగునాట కీర్తి తెచ్చుకున్న కన్నాంబ పూర్తి పేరు పసుపులేటి కన్నాంబ. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో 1912 లో జన్మించిన కన్నాంబ ఆనాటి నావెల్ నాటక సమాజంలో పదమూడు సంవత్సరాల వయస్సులో బాల పాత్రలు వేస్తూ తొలిసారిగా నాటక రంగ ప్రవేశం చేసింది. తన నాటకరంగానుభవంతో 1935లో "హరిశ్చంద్ర" తెలుగు చలన చిత్రంలో ' చంద్రమతిగా అడుగు పెట్టింది. ఆ తర్వాత "ద్రౌపదీ వస్త్రాపహరణం"లో" ద్రౌపదిగా అధ్బుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను అందుకుంది. సుమారు 150 పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో తనదైన శైలిలో అద్వితీయంగా నటించి గొప్ప నటీమణిగా కీర్తి గడించింది. నవరసాలను సమర్థవంతంగా అవలీలగా పోషించగల అద్భుత నటీమణి కన్నాంబ . కన్నాంబ భర్త నాగభూషణం , ఇద్దరూ కలసి ' రాజరాజేశ్వరీ ' చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి అనేక చిత్రాలు తెలుగులోను , తమిళ, కన్నడ భాషలలోను నిర్మించారు.

Aatma Balam (1964)
Ramadasu (1964) .... Ramadasu's wife
Paruvu Prathishta (1963)
Lava Kusa (1963/I) .... Kousalya
Apta Mithrulu (1963)
Atma Bandhuvu (1962)
Dakshayagnam (1962/I) .... Daksha's wife
Jagadeka Veeruni Katha (1961) .... Parvathi Devi
Usha Parinayam (1961)
Abhimanam (1960) .... Mother
Raja Makutam (1959/I)
Anna Thamudu (1958)
Mangalya Balam (1958)
Shri Krishna Maya (1958)
Kutumba Gauravam (1957/I)
Makkalai Petra Maharasi (1957) .... Angamma
Todi Kodallu (1957) .... Kamala
Charana Daasi (1956)
Anarkali (1955)
Shri Krishna Tulabharam (1955/I)
Manohara (1954/I) (as P. Kannamba) .... Queen
Saudamini (1951/I)
Palnati Yudham (1947) .... Naagamma
Mayalokam (1945)
Maya Machhindra (1945)
Paduka Pattabhishekham (1945) .... Kaikeyi
Mahamaya (1944) .... Mahamaya
Kannagi (1942) .... Kannagi
Sumati (1942)
Ashok Kumar (1941) .... Tishyaralshithai
Talliprema (1941) .... Santha
Bhoja Kalidasa (1940)
Chandika (1940) .... Chandika
Mahananda (1939)
Grihalakshmi (1938) .... Radha
Kanakatara (1937)
Sarangadhara (1937/I)
Draupadi Vastrapaharanam (1936) .... Draupadi
Harishchandra (1935) .... Chandramathi
Seeta Kalyanam (1934)

నేపధ్య గాయనిగా
Sumati (1942) (playback singer)
Talliprema (1941) (playback singer)
Grihalakshmi (1938) (playback singer)