Saturday, February 28, 2009

కొమ్మారెడ్డి సావిత్రి (6 డిసెంబర్ 1937 - 26 డిసెంబర్ 1981)


తెలుగు చిత్రసీమలోన కళాభినేత్రి
కోకిలంటి కంఠమున్నసుమధుర గాత్రి
కన్నులతో కథలు చెప్పు విశాల నేత్రి
నీ నటనతోనె ధన్యమయ్యేనీ ధరిత్రి....

తెలుగు సినీ ప్రపంచం లో మహానటి, కొమ్మారెడ్డి సావిత్రి (1937 డిసెంబర్ 6 - 1981 డిసెంబర్ 26) . తెలుగు తమిళ సినిమాల్లో కూడా నటించి, మహానటి అనిపించుకుని, తరాల తరువాత కూడా ఆరాధింపబడుతూంది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో 1936 డిసెంబర్ 6 న నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది. తన ఆరవ యేటనే తండ్రిని కోల్పోవడము వల్ల పెదనాన్న సహాయముతో విజయవాడ లోని కస్తూరీబాయి మెమోరియల్ పాఠశాలలో మూడవ ఫారం (8వ తరగతి) వరకు చదువుకున్నది. శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం మరియూ శాస్త్రీయ నృత్యం నేర్చుకొని విజయవాడలో తన చిన్నతనంలోనే ప్రదర్శనలు ఇచ్చింది. కొంతకాలం ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసి, అనంతరం స్వయంగా పెదనాన్న నడిపిన నాట్య మండలిలో కూడా నటించింది. బుచ్చిబాబు రాసిన ఆత్మవంచన అనే నాటకంలో కూడా నటించింది.

పెదనాన్న ప్రోద్బలంతో సినిమా రంగం వైపు దృష్టి సారించి ఎన్నో కష్టాలనోర్చి తిరుగులేని అభినేత్రి గా విరాజిల్లింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం సినిమాలో చిన్న పాత్ర పొంది, ఆనక ఆ పాత్రకు తగ్గ వయసు లేదని అందులోనుండి తొలగింపబడింది. ఆ తరువాత కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన పాతాళ భైరవిలో ఒక చిన్న పాత్రలో నటించింది. పెళ్ళిచేసిచూడు ఆమె సినీ జీవితంలో ఒక మలుపు. కాని అందులో ఆమె రెండో కథానాయిక పాత్రకే పరిమితం కావలసి వచ్చింది. తన నటనా ప్రతిభను నిరూపించుకోవటానికి ఆమె, నృత్యరూపకుడు మరియూ దర్శకుడూ అయిన వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన దేవదాసు సినిమా వరకూ ఆగవలసి వచింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో మిస్సమ్మ లో ప్రధానపాత్ర పోషించింది. ఆ చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా స్థిరపడింది. ఆ తరువాత వచ్చిన దొంగరాముడు, అర్థాంగి, చరణదాసి ఆమె స్థానాన్ని పదిలపరచాయి.1957 లో వచ్చిన తెలుగు చిత్ర చరిత్ర లోనే అజరామరం అనదగిన మాయాబజార్ చిత్రంలో ఆమె ప్రదర్శించిన అసమాన నటనా వైదుష్యం ఆమె కీర్తి పతాకంలో ఒక మణిమకుటం.అది మొదలు యెన్నో వైవిధ్యమైన పాత్రలను తనకే సాధ్యమైన రీతిలో పోషించి వాటికి ప్రాణ ప్రతిష్ట చేసింది.
ఆమె తమిళచిత్రాలలోనూ నటించి, పేరుతెచ్చుకుంది. తమిళంలోనూ మహానటి (నడిగెయర్ తిలగం) బిరుదు పొందింది. 1968 లో చిన్నారి పాపలు సినిమాకు దర్శకత్వం వహించింది.ఈ సినిమా కు ఒక ప్రత్యేకత వుంది.బహుశా దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా దాదాపు పూర్తిగా మహిళలచే నిర్మింపబడిన చిత్రంగా ప్రత్యేకత సంతరించుకున్నది . అయితే అది అంత విజయం సాధించలేదు.ఆ తరువాత చిరంజీవి,మాతృదేవత,వింత సంసారం మొదలగు సినిమాలకు దర్శకత్వం వహించింది. 1956లో అప్పటికే రెండు పెళ్ళిళ్ళయిన తమిళ నటుడు జెమినీ గణేశన్ ను పెళ్ళిచేసుకుంది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు - విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్. అయితే ఆ పెళ్ళి విఫలమైంది. ఆస్తిపాస్తులు కోల్పోయి, తాగుడుకు, మత్తుమందులకు, నిద్రమాత్రలకు బానిసై, 1981 డిసెంబర్ 26 న మరణించింది.
మల్లెపూలు, వర్షం సావిత్రికి ఇష్టమైనవి. ఆమెది ఎడమచేతి వాటం. క్రికెట్, చదరంగం ఆటలను బాగా ఇష్టపడేది. చెన్నైలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆమె తప్పక చూసేది. వెస్టిండీస్ ప్రముఖ ఆటగాడు "గ్యారీ సోబర్స్" కు సావిత్రి అభిమాని. ఆ రోజుల్లోనే శివాజీగణేశన్ తోపాటు తారల క్రికెట్లో పాల్గొనేది. ఆమె వద్ద ఏనుగుదంతంతో చేసిన చదరంగం బల్లకూడా ఉండేది. సావిత్రి మంచి చమత్కారి, అంతే కాదు ఇతరులను అనుకరించటంలో కూడా దిట్ట. ఆమె తన భర్త జెమినీ గణేశన్ను, రేలంగిని, సరోజాదేవిని, ఎస్వీ రంగారావుని, ఇంకా అనేకమందిని తరుచూ అనుకరించేది. దానధర్మాల విషయంలో అమెది ఎముకలేని చెయ్యి. ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ని కలిసేందుకు వెళ్ళి, అక్కడ మొత్తం నగలన్నిటినీ వలిచి ప్రధానమంత్రి సహాయ నిధికి దానమిచ్చేసింది.
ఆమె సినిమాలు:
నటి గా
సంసారం (1950)
అగ్నిపరీక్ష (1951)
పాతాళభైరవి (1951)లో నృత్యకారిణి
పెళ్ళిచేసి చూడు (1952)లో సావిత్రి
పల్లెటూరు (1952)లో సుగుణ
ప్రతిజ్ఞ (1953)
దేవదాసు (1953)లో పార్వతి
బ్రతుకుతెరువు (1953)లో జమీందారుగారి కూతురు
మేనరికం (1954)
చంద్రహారం (1954)లో చంచల
బహుత్ దిన్ హుయే (1954) (హిందీ సినిమా)
పరివర్తన (1954)లో సుందరమ్మ వదిన
మిస్సియమ్మ (1955) (తమిళ సినిమా)
మిస్సమ్మ (1955)లో మేరీ/మహాలక్ష్మి
అర్ధాంగి (1955)
సంతానం (1955)లో శారద
కన్యాశుల్కం (1955)లో మధురవాణి
దొంగరాముడు (1955)లో సీత
చరణదాసి (1956)లో లక్ష్మి
భలేరాముడు (1956)
అమరదీపం (1956)లో అరుణ
వినాయకచవితి (1957)లో సత్యభామ/భూదేవి
తోడికోడలు (1957)లో
సుశీల ఎమ్మెల్యే(M.L.A.) (1957)లో నిర్మల
మాయాబజార్ (1957)లో శశిరేఖ
మాయాబజార్ (1957) (తమిళ సినిమా)లో శశిరేఖ
కర్పూరకరసి (1957) (తమిళ సినిమా)లో మంజుల
మాంగల్యబలం (1958)
అప్పుచేసి పప్పుకూడు (1958)లో మంజరి
నమ్మినబంటు (1959)
విమల (1960)
శ్రీవెంకటేశ్వరమహత్యం (1960)లో పద్మావతి
శాంతినివాసం (1960)
దీపావళి (1960)
చివరకు మిగిలేది (1960)లో పద్మ
పాపపరిహారం (1961)
పసమలార్ (1961) (తమిళ సినిమా)లో రాధ
పాండవవనవాసం (1961)లో ద్రౌపది
కలసివుంటే కలదుసుఖం (1961)
సిరిసంపదలు (1962)
పవిత్రప్రేమ (1962)
మనితన్ మరవిల్లై (1962) (తమిళ సినిమా)
మంచిమనసులు (1962)
ఆరాధన (1962)లో అనూరాధ
గుండమ్మ కథ (1962)లో లక్ష్మి
రక్తసంబంధం (1962)
ఆత్మబంధువు (1962)
రక్తతిలకం (1963)లో కమల
మూగ మనసులు (1963)లో రాధ
కర్ణలో (1963) భానుమతి
కర్ణన్ (1963) (తమిళ సినిమా)లో భానుమతి
ఘర్ బసాకే దేఖో (1963) (హిందీ సినిమా)
చదువుకున్న అమ్మాయిలు (1963)లో సుజాత
నర్తనశాల (1963)లో ద్రౌపది
వెలుగునీడలు (1964)లో సుగుణ
పూజాఫలం (1964)లో సీత
నవరాత్రి (1964)
కైకొడుత్తదైవం (1964) (తమిళ సినిమా)
గంగా కీ లెహరే (1964) (హిందీ సినిమా)
డాక్టర్ చక్రవర్తి (1964)లో మాధవీ దేవి
దేవత (1964)
సుమంగళి (1965)
తిరువిలయాదల్(1965) (తమిళ సినిమా)లో పార్వతి యొక్క వివిధ రూపాల్లో నటించింది.
నాదీ ఆడజన్మే (1965)
మనుషులు మమతలు (1965)
నవరాత్రి (1966)
భక్తపోతన (1966)లో సరస్వతీదేవి
ప్రాణమిత్రులు (1967)
వరకట్నం (1968)
తల్లితండ్రులు (1970)లో కౌసల్య
మరోప్రపంచం (1970)
అశ్వథ్థామ (1970)లో కుంజుని భార్య
జగన్మోహిని (1978)
అందరికంటే మొనగాడు (1985)
దేవదాసు మళ్లీ పుట్టాడు
గోరింటాకు (చివరి సినిమా)

నిర్మాతగా
ఏక్ చిట్టీ ప్యార్ భరీ(1985) (హిందీ సినిమా)
దర్శకురాలిగా
మాతృదేవత (1970)
ఇతరములు
నవరాత్రి (1966) సినిమాలో నేపథ్య గాయని

No comments: